సుధీర్ వర్మ డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా రణరంగం. శర్వానంద్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శి నటిస్తున్నారు. ఆగష్టు 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది. సినిమాకు సంబందించిన గ్రాఫిక్స్ వర్క్స్ తో పాటుగా డిఐ కూడా పూర్తి కాలేదట అందుకే సినిమా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే సినిమా అవుట్ పుట్ చూసిన శర్వానంద్ కొన్ని మార్పులు సూచించాడట. అందుకే సినిమా వాయిదా వేస్తున్నారని ఇన్నర్ టాక్. ఏది ఏమైనా ఆగష్టు 2న మాత్రం రణరంగం రిలీజ్ వాయిదా పడ్డది. ఈ సినిమాకు పోటీగా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు, ఆరెక్స్ హీరో కార్తికేయ నటించిన గుణ 369 రిలీజ్ కానున్నాయి. అయితే శర్వానంద్ మూవీ వాయిదా పడటంతో ఈ రెండు సినిమాలు మాత్రమే ఆరోజు రిలీజ్ అవనున్నాయి.