టీడీపీని టార్గెట్‌ చేస్తూ నాని ట్వీట్‌...వెంకన్న కౌంటర్‌

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 09:16 AM

టీడీపీ నేతల ట్వీట్టర్‌ వార్‌ మరింత ముదిరింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నానిలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీని టార్గెట్‌ చేస్తూ నాని ట్వీట్‌ చేయగా.. దానికి వెంకన్న కౌంటర్‌ ఇచ్చారు. 'సంక్షోభం సమయంలో పార్టీ కొసం నాయకుడి కొసం పొరాడేవాడు కావాలి....ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం....నీలాగా అవకాశవాదులు కాదు...చనిపొయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పొరాడేవాడు కావాలి' అని నాని పేరును ప్రస్తావించకుండా వెంకన్న ట్వీట్‌ చేశారు. దీనికి.. 'నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు. నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు. నాలుగు వాక్యాలు రాయలేనివాడు Tweet చేస్తున్నాడు. దౌర్భాగ్యం!' అని కౌంటర్‌ ట్వీట్‌ చేశారు నాని.

ఇలా ట్వీట్లు.. రీ ట్వీట్లు.. కౌంటర్‌ ట్వీట్లతో కొనసాగుతున్న ఈ వివాదం ఇవాళ తీవ్ర స్థాయికి చేరింది. బుద్దా వెంకన్న పేరును ప్రస్తావించకుండానే ఆయణ్ను 'పెంపుడు కుక్క' అని అన్నారు నాని. ఈ విషయమై నేరుగా బాస్‌ చంద్రబాబుకే ప్రశ్న సంధించారు. 'చంద్రబాబు గారూ.. నాలాంటి వ్యక్తులు మీ పార్టీలో ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా' అని ప్రశ్నించారు. 'ఒకవేళ నేను పార్టీలో కొనసాగాలని మీరు భావిస్తే.. మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టండి' అని కోరారు నాని. చంద్రబాబు రంగంలోకి దిగి ఇద్దరినీ కంట్రోల్‌ చేస్తారా.. లేక వీరి ట్వీట్ల యుద్ధం కొనసాగుతుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది.





Untitled Document
Advertisements