అమరావతి: నడిరోడ్డుపై ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తి కిరాతకంగా హత్య చేసిన సంఘటన విశాఖ జిల్లా చోరవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చోరవరంలో ఎడ్లవీధికి చెందిన కోన రాజేశ్(21)ను నగరంలోని బిఎస్ రోడ్డు ప్రాంతంలోని ఓ మద్యం దుకాణం వద్ద హెల్మెంట్ ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజష్ ను అత్యంత దారుణంగా నరకడంతో కిందపడిపోయాడు. ఆ తర్వాత కొద్దిదూరం వెళ్లిన దుండగుడు వెనక్కి తిరిగి రక్తపుమడుగులో ఉన్న రాజేష్ చనిపోయాడో లేదో అని మరోసారి కత్తితో వేటు వేసి అక్కడి నుంచి పరిపోయాడని తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, రాజేశ్ పై దాడి చేసిన వ్యక్తి ఎవరు? ఈ హత్యకు గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.