మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు మాదిరిగా విదేశీ పర్యటనలు చేయలేదని అన్నారు. చంద్రబాబు పర్యటనల వల్ల ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని చెప్పారు. కియా ప్రాజెక్టు కూడా చంద్రబాబు వల్ల రాలేదని... వైయస్ రాజశేఖర్ రెడ్డి విన్నపం వల్లే అనంతపురం జిల్లాలో కియా ప్లాంటును నెలకొల్పారని తెలిపారు. కియా సీఈవోకి జగన్ లేఖ రాశారని చెప్పారు. రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలని 2007లో జగన్ కు కియా సీఈవో కూడా లేఖ రాశారని తెలిపారు. దేశంలో ప్లాంట్ పెడితే ఏపీలోనే పెట్టాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తమను ఆనాడే కోరినట్టు లేఖలో పేర్కొన్నారని చెప్పారు.