కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కొద్ది రోజులుగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో చికిత్సను నిలిపివేసినట్టు తెలిసింది. ఈక్రమంలో ఆయన అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గోషా మహల్ నుంచి పోటీ చేసి ముఖేష్గౌడ్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా అనుచరులు, కుటుంబసభ్యుల సహాయంతో ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతతో కనిపించారు. దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖేష్గౌడ్ మంత్రిగా పనిచేశారు.