బీజేపీ తీర్థం పుచ్చుకున్న సోమారపు

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 05:36 PM

ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. త్వరలో జరగబోయే నగరపాలక ఎన్నికల్లో ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే తాను మేయర్ స్థానానికి పోటీ చేస్తానని తెలిపారు.

తన మద్దతుదారులను కార్పొరేటర్లుగా బరిలో నిలిపి, వారి విజయానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, డి అరవింద్ ఇవాళ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.





Untitled Document
Advertisements