మన్మథుడు 2 పోస్టర్ రిలీజ్

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 05:47 PM

నాగార్జున మన్మథుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఇప్పటికే రెండు టీజర్లు రిలీజ్ చేశారు. రెండింటిలోనూ రచ్చ పీక్ స్టేజ్ లో ఉన్నది. ఇప్పుడు మన్మథుడు 2సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జున మధ్యలో నిలబడి ఉంటె.. ఒకవైపు అక్కలు, మరవైపు తల్లి లక్ష్మి, రకుల్ ప్రీత్ ఉంటారు.


నాగ్ పై చాడీలు చెప్తూ ఆటపట్టిస్తుంటారట. ఇంట్లో ఉండే ఆడవాళ్ళ వలన పాపం నాన్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతాడట. దీని నుంచి బయపడేందుకు మన్మథుడు గా అవతారం ఎత్తుతాడని ఫోటో చూస్తుంటే అర్ధం అవుతుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన కథ ఏంటి ఎలా ఉంటుంది అన్నది ఆగష్టు 9 వ తేదీ వరకు వెయిట్ చేస్తే తేలిపోతుంది కదా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత, కీర్తి సురేష్ లో అతిధి పాత్రల్లో నటించారు.





Untitled Document
Advertisements