పని కోసం వచ్చిన దళిత మహిళని.... ఏం చేసావో అప్పుడే మర్చిపోయావా?

     Written by : smtv Desk | Wed, Jul 17, 2019, 02:48 PM

పని కోసం వచ్చిన దళిత మహిళని.... ఏం చేసావో అప్పుడే మర్చిపోయావా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ దళితులను, గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారనీ, అందుకు అనుగుణంగానే బడ్జెట్ లో కేటాయింపులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున తెలిపారు. కానీ ఈ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి ‘దళితులగా ఎవరైనా పుట్టాలనుకుంటారా?’ అని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఈ మాట అన్నందుకు ఆయన సిగ్గుపడాలనీ, ఆయనకు అసెంబ్లీలో కూర్చునే అర్హతే లేదని దుయ్యబట్టారు. తనలాంటి వాళ్లు దళిత కులంలోనే మళ్లీమళ్లీ పుట్టాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు మేరుగు నాగార్జున మాట్లాడారు.

"మామీద జరిగిన దాడులు అనేకం అధ్యక్షా. గగరపురంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టమని అడిగితే, వెలివేశారు. చనిపోయిన ఆవు చర్మాన్ని వొలుస్తున్న మా కులస్తులపై దాడి చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడలేదు. పెందుర్తితో దళిత మహిళను వివస్త్రను చేస్తే కనీసం మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ ప్రతీదానికి అచ్చెన్నాయుడు లేస్తున్నాడు. ఓ ఎస్సీ మహిళ నీ దగ్గర పనికి వస్తే బూటు కాలితో తన్నావే? నువ్వా ఈరోజు మాట్లాడేది? నీకు సిగ్గులేదు. ఇలాంటి అవమానాలు కోకొల్లలుగా జరిగాయి" అని నాగార్జున తెలిపారు.





Untitled Document
Advertisements