నిరుద్యోగ భృతిని రద్దు చేయడం ద్వారా 6 లక్షల మందికి అన్యాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. వైసీపీ పనితీరు కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. టెండర్ల రద్దు కారణంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మట్టి పనులు మాత్రమే జరిగాయని, కాంక్రీట్ పనులన్నీ చంద్రబాబు హయాంలో జరిగినవేనని రామానాయుడు స్పష్టం చేశారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను నిలిపివేసి రైతులకు నష్టం కలుగజేయొద్దని కోరారు.