తిరుపతి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 04:01 PM

తిరుపతి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

తిరుపతి-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ మార్గంలో వారంలో మూడ్రోజుల పాటు ప్రత్యేక రైళ్లు తిప్పుతామని చెప్పారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకూ ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని, ప్రతి ఆది, మంగళ, బుధవారాల్లో సాయంత్రం 6.50 గంటలకు తిరుపతి, కాకినాడలలో ఈ రైళ్లు బయలుదేరతాయని సంబంధిత అధికారులు వివరించారు.





Untitled Document
Advertisements