ఒప్పో తాజాగా మరో కొత్త స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేసింది. ‘ఒప్పో ఏ9’ పేరుతో ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్ లో లభ్యం కానుంది. ఈఫోన్ ధరను రూ.15,490గా నిర్ణయించింది. జులై 20 నుంచి భారత మార్కెట్లలో లభ్యం కానుంది. వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లు అందించడమే తమ లక్ష్యమని ఒప్పో ఇండియా సీఈవో చార్లెస్ వాంగ్ తెలిపారు. ఈ ఫోన్ ఫీచర్::6.35 ఫుల్హెచ్డీ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో పి70 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 16ఎంపీ+2ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ.