సైన్యం తుపాకులు మరమత్తులు చేసేది వీరే!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 06:17 PM

సైన్యం తుపాకులు మరమత్తులు చేసేది వీరే!

సాధారణంగా యుద్దరంగంలో తుపాకి పట్టిన మహిళల గురించి తెలిసే ఉంటుంది. కాని సైనికుల తుపాకులకు మరమ్మతులు చేసే మహిళలు మాత్రం అరుదు. అయితే నేపాల్ సైన్యంలో మాత్రం తుపాకులకు మరమ్మతు చేసేవారిలో మహిళలు ఉన్నారు. మొత్తం నేపాల్ సైన్యంలో తుపాకులకు మరమ్మతు చేసేవారిలో కేవలం నలుగురు మహిళలే ఉన్నారు. వారే లీలా కాప్లే, హిమా పోఖ్రాల్, అస్మితా ఆచార్య, కుస్ కుమారి థాపా. వీరి గురించి పెద్దగా ఎవ్వరికి తెలీదు. కాని వీరు మరమత్తు చేసిన తుపాకులకు మాత్రం తిరుగుండదు. ఈ సందర్భంగా...అందులో ఒకరైన లీలా కాప్లే మాట్లాడుతూ..."నేపాల్ సైన్యంలో తుపాకులకు మరమ్మతుచేసేవారిలో నేను మొదటి మహిళను అయినందుకు గర్వపడుతున్నా. ఆర్మీలో తప్ప మరెక్కడా నేర్చుకోలేని పని ఇది. ఈ ఉద్యోగంలో నిబద్ధత చాలా అవసరం. ఎందుకంటే తుపాకీతో కాల్చినప్పుడు తూటా కచ్చితంగా గురిపెట్టిన చోటే తగలాలి" అని చెప్పారు. మగవారు యుద్ధభూమిలో పోరాడుతున్నపుడు మహిళలు తుపాకులను ఎందుకు మరమ్మతు చేయకూడదని అనిపించిందని, తాను కూడా పురుషులతో సమానంగా పనిచేయాలని అనుకోవడం వల్లే ఈ వృత్తిని ఎంచుకొన్నానని కుస్ కుమారి థాపా తెలిపారు.ఈ వృత్తిలోకి మహిళలను తీసుకోవడాన్ని నేపాల్ సైన్యం తొమ్మిదేళ్ల కిందట మొదలుపెట్టింది.సైన్యంలో శిక్షణ ప్రారంభంలో, ఈ తుపాకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉండేదని హిమా పోఖ్రాల్ చెప్పారు. తాను పనిచేసేందుకు ఆయుధ నిర్వహణ విభాగాన్ని ఎంచుకున్నానని తెలిపారు.ఈ వృత్తిలో ఉన్న విదేశీ మహిళలను చూసి తాను కూడా గన్‌స్మిత్ కావాలనుకున్నానని అస్మితా ఆచార్య చెప్పారు. "సైన్యంలో పనిచేసే మహిళలు చాలా మందే ఉన్నారు. కానీ తుపాకులకు మరమ్మతులు చేసే మహిళలు నలుగురే ఉన్నారు. వారిలో నేనొకరిని కావడం చాలా సంతోషంగా ఉంది. పురుషుల వృత్తిగా పరిగణించే ఈ పనిని నేను కూడా చేయగలగడం గర్వంగా అనిపిస్తోంది" అని ఆమె సంతోషం వ్యక్తంచేశారు.





Untitled Document
Advertisements