కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన యువకుడు... ఆపరేషన్ లో బయటపడ్డ 33 వస్తువులు!!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 02:15 PM

కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన యువకుడు... ఆపరేషన్ లో బయటపడ్డ 33 వస్తువులు!!

కడుపునొప్పితో ఉందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువకుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు విస్తుపోయారు. అతని కడుపుతో కత్తులు, సూదులు, ఏరేజర్లు సహా 33 రకాల వస్తువులు ఉండటం చూసి షాక్ కు గురయ్యారు. ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఛత్తర్ పూర్ జిల్లా బుందేల్ ఖండ్ కు చెందిన యోగిత్ సింగ్(30) పెన్ను, పెన్సిల్, ఇనుప కత్తులు, ఎరేజర్ సహా పలు వస్తువులను మింగేశాడు. దీంతో ఆయనకు కడుపునొప్పి వచ్చింది.

కుటుంబ సభ్యులు వెంటనే యోగిత్ ను జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే బాధితుడికి ఎక్స్ రే తీసిన వైద్యులు కడుపులో పలు వస్తువులు ఉండటం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించి పెన్ను, పెన్సిల్, కత్తులు సహా 33 వస్తువులను బయటకు తీశారు. కాగా, ప్రస్తుతం యోగిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.





Untitled Document
Advertisements