ఎఫ్సిజి కల్లావే జూనియర్ ప్రపంచ గోల్ఫ్ చాంపియన్షిప్లో భారత్కు ట్రోఫీ దక్కింది. భారత్కు చెందిన అర్జున్ భాటి అమెరాకలోని కాలిఫోర్నియా పామ్ డెజర్ట్లో జరిగిన ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీ దక్కించుకున్నాడు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా తైవాన్ ఆటగాడు జెరేమీ చెన్ స్టోక్స్ న్యూజిలాండ్ ఆటగాడు జోషువా బై నిలిచారు. ఈ టోర్నీలో వివిధ దేశాలను నుంచి గోల్ఫర్లు పాల్గొన్నారు. కాగా నోయిడాకు చెందిన అర్జున్ భాటి ఇప్పటివరకు పలు టోర్నమెంట్లలో పాల్గొని టైటిళ్లు గెలిచాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్లో దేశానికి పతకం తీసుకురావాలనేది అర్జున్ లక్ష్యం.