దేశరాజధాని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇకలేరు!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 05:50 PM

దేశరాజధాని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇకలేరు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. షీలా ఢిల్లీకి 1998-2013 మధ్య 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2014లో కేంద్రంలో కాంగ్రెస్ ఓడాక ఆమె కేరళ గవర్నర్ గా వెళ్లారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సీఎం అభ్యర్థి. షీలా భర్త, ఐఎస్ఏ అధికారి వినోద్ కొన్నేళ్ల కిందట చనిపోయారు. వీరి కొడుకు సందీప్ మాజీ ఎంపీ.





Untitled Document
Advertisements