పసిడి పరుగుకు బ్రేకులు...వెండి మాత్రం!

     Written by : smtv Desk | Tue, Aug 13, 2019, 06:15 PM

పసిడి పరుగుకు బ్రేకులు...వెండి మాత్రం!

మంగళవారం(ఆగస్ట్13) బంగారం ధర దిగొచ్చింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,370కు పడిపోయింది. అయితే బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. రూ.2,000 పెరుగుదలతో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది. కేజీ వెండి ధర రూ.45,000 మార్క్‌కు పరుగులు పెట్టింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పంజుకోవడం ధరపై సానుకూల ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెడుతూనే ఉంది. ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 0.7 శాతం పెరుగుదలతో 1,521.98 డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర ఔన్స్‌కు 1.8 శాతం పెరుగుదలతో 17.36 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,370కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,200కు దిగొచ్చింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.28,800కు చేరింది. కేజీ వెండి ధర రూ.2,000 పెరుగుదలతో రూ.45,000కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.956 పెరుగుదలతో రూ.44,280కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. రూ.1,000 పెరుగుదలతో కొనుగోలు ధర రూ.89,000కు, అమ్మకం ధర రూ.90,000కు పరుగులు పెట్టింది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,080కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,270కు పెరిగింది. కేజీ వెండి ధర (రిటైల్) రూ.49,000 వద్దకు ఎగసింది.





Untitled Document
Advertisements