మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న షియోమీ

     Written by : smtv Desk | Tue, Aug 13, 2019, 06:51 PM

మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న షియోమీ

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకొస్తోంది. Mi A3 పేరుతొ వస్తున్న ఈ ఫోన్లో ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌ యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మంగళవారం (ఆగస్టు 13) ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు. Mi A3 స్మార్ట్ ఫోన్ రిలీజ్‌ షెడ్యూల్‌కు సంబంధించి చైనీస్ కంపెనీ ఇప్పటికే మీడియా ఇన్విటేషన్లు పంపింది. Mi.in ఇండియా వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.Mi A2 స్మార్ట్ ఫోన్‌తో మార్కెట్లో మంచి సక్సస్ అందుకున్న షియోమీ.. గూగుల్ ఆండ్రాయిడ్ ఒన్ ప్రొగ్రామ్‌తో కంపెనీ నుంచి మూడో స్మార్ట్ ఫోన్ Mi A3 రిలీజ్ చేస్తోంది. ఇందులో Triple Camera సెటప్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. గ్రేడియంట్ ఫినీష్‌తో వస్తోంది. Mi A3లో ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది.న్యూఢిల్లీలో ఆగస్టు 21న (మధ్యాహ్నాం 12 గంటల నుంచి) ఇండియాలో Mi A3 స్మార్ట్ ఫోన్ షియోమీ లాంచ్ చేయబోతున్నట్టు జైన్ తన ట్వీట్ లో తెలిపారు. Mi A3 ఇండియాలో లాంచింగ్ ముందు ఓ టీజర్ వీడియోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే.షియోమీ కంపెనీ.. స్పెయిన్‌లో జూలై నెలలో Mi A3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ వేరియంట్ (64GB స్టోరేజీ) ప్రారంభ ధర EUR 249.. ఇండియన్ కరెన్సీలో రూ.19వేల 900 వరకు ఉంటుంది.128GB స్టోరేజీ ఆప్షన్ ప్రారంభ ధర EUR 279 (దేశీయ కరెన్సీలో రూ.22వేల 200 వరకు ఉంటుంది. స్పానీస్ మార్కెట్ మాదిరిగా ఇండియాలో కూడా మార్కెట్ పరంగా Mi A3 ప్రారంభ ధర ప్రకటించే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements