టీంమిండియాతో సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 02:56 PM

టీంమిండియాతో సిరీస్‌ల కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

సెప్టెంబరు 15 నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభంకానున్న టీ20, టెస్టు సిరీస్‌ల కోసం తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు రెండు జట్లని ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా విఫలమైన డుప్లెసిస్‌పై టీ20ల్లో వేటు వేసిన దక్షిణాఫ్రికా.. వికెట్ కీపర్ డికాక్‌కి టీ20 జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే.. టెస్టు జట్టు‌కి మాత్రం కెప్టెన్‌గా డుప్లెసిస్‌ కొనసాగనున్నాడు. వన్డే, టీ20లపై ఎక్కువ శ్రద్ధ పెట్టేందుకు ఇటీవల టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌కి టీ20 జట్టులో చోటు దక్కకపోవడం కొసమెరుపు. ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. టీ20 జట్టులో ఎక్కువగా యువ క్రికెటర్లకే దక్షిణాఫ్రికా అవకాశమిచ్చింది. దీంతో.. డేవిడ్ మిల్లర్, డికాక్, కగిసో రబాడ మినహా.. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న ఆటగాళ్లు టీ20 జట్టులో తక్కుగానే కనిపిస్తున్నారు. సెప్టెంబరు 15 నుంచి మూడు టీ20లు, మూడు టెస్టులని భారత్ గడ్డపై టీమిండియాతో సఫారీలు ఆడనున్నారు.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు: డికాక్ (కెప్టెన్, వికెట్ కీపర్), దుస్సేన్ (వైస్ కెప్టెన్), బవుమా, జూనియర్ డాలా, బోర్న్ పోర్టుయిన్, హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్, ఫెహ్లుక్వాయో, పిట్రోరియస్, కగిసో రబాడ, షంషీ, స్మట్స్ .
దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: డుప్లెసిస్ (కెప్టెన్), బవుమా (వైస్ కెప్టెన్), బ్రూయిన్, డికాక్ (వికెట్ కీపర్), డీన్ ఎల్గర్, హజ్మా, కేశవ్ మహరాజ్, మర్‌క్రమ్, ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, అన్రిచ్, ఫిలాండర్, డేన్ పైడిట్, కగిసో రబాడ, రుడి సెకండ్ .





Untitled Document
Advertisements