రేపు రిలీజ్ కానున్న అడివి శేష్ మూవీ

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 03:17 PM

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా పివిపి సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న థ్రిల్లర్ ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో అడివిశేష్ మాట్లాడుతూ “నేను, వెన్నెలకిషోర్, మరికొంత మంది మిత్రులు కలిసి ఈ సినిమా చూశాం. వెన్నెలకిషోర్ సినిమా చూసిన తర్వాత నన్ను కౌగిలించుకున్న విధానం చూసి నాలో నమ్మకం మరింత పెరిగింది. అలాగే ఈ సినిమాను ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ 1000 మందికి చూపించాం. మాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం కలిగింది. ఓ సందర్భంలో ఇక మేం మాట్లాడటానికి ఏమీ లేకుండా.. వాళ్లే వచ్చి పలానా అంశం బావుందని, నచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది”అని అన్నారు.

రెజీనా కసండ్ర మాట్లాడుతూ… “రామ్‌జీ, శేష్ వచ్చి నాకు సినిమా కథ చెప్పారు. నాకు నచ్చింది. సినిమాలో నా సామ్ లుక్‌నే కాదు.. పాత్రను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు”అని తెలిపారు. పివిపి మాట్లాడుతూ “రామ్‌జీ మా బ్యానర్‌లో ఇంతకుముందు‘సైజ్ జీరో’కు వర్క్ చేశాడు. ఈ మూవీ గురించి నేను మాట్లాడటం కంటే ప్రేక్షకులు చూసి మాట్లాడాలి. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. జెర్సీ, బ్రోచెవారెవరురా, ఆత్రేయ.. ఇలా చాలా మంచి సినిమాలు రూపొందుతున్నాయి. అలాగే మంచి సినిమాల జాబితాలో ‘ఎవరు’ కూడా భాగమవుతుందని అనుకుంటున్నాను”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నవీన్‌చంద్ర, శ్రీచరణ్ పాకాల తదితరులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements