బిజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీకి అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన కార్యాలయంలోని సభ్యులు ఒకరు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత ఐదు రోజులుగా ఆయన వైరల్ ఫీవర్తో బాధ పడుతున్నారని వెల్లడించింది. ఈ కారణం వల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అడ్వాణీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం జరగబోదని తెలిపింది.ప్రస్తుతం అడ్వాణీకి 91 ఏళ్లు. భాజపా సహ వ్యవస్థాపకుడైన ఆయన, పార్టీ నిర్మాణానికి విశేషమైన కృషి చేసిన సంగతి తెలిసిందే. వాజ్పేయీ హయాంలో ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు.