వాహనదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 12:09 PM

వాహనదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వాహనదారులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ప్రయోజనం పొందొచ్చు. ఎస్‌బీఐ దీని కోసం బీపీసీఎల్‌తో జతకట్టింది. స్టేట్ బ్యాంక్ బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డును అందిస్తోంది. ఈ కార్డు కోసం అప్లై చేసుకుంటే 2,000 యాక్టివేషన్ బోనస్ పాయింట్లు పొందొచ్చు. జాయినింగ్ ఫీజు రూ.500. ఈ ఫీజు చెల్లించిన 20 రోజుల తర్వాత 2,000 పాయింట్లు వస్తాయి. ఈ పాయింట్ల ద్వారా బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోవచ్చు. కార్డు రెన్యూవల్ ఫీజు రూ.499. రూ.4,000 వరకు లావాదేవీలపై ఫ్యూయెల్ సర్‌చార్జ్ ఉండదు. బీపీపీఎల్ బంకుల్లో వాహనానికి ఇంధనాన్ని పట్టిస్తే 13 రెట్లు రివార్డు పాయింట్లు గెలుచుకోవచ్చు. గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, మూవీస్, రెస్టారెంట్లు, యుటిలిటి బిల్స్ పేమెంట్ కార్డు ఉపయోగిస్తే ప్రతి రూ.100పై 5 రెట్లు రివార్డు పాయింట్లు లభిస్తాయి. 4 రివార్డు పాయింట్లు కలిసి రూ.1కు సమానం. దేశవ్యాప్తంగా ఉన్న 1,200 బీపీసీఎల్ ఔట్‌లెట్స్‌లో ఈ పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements