భారతీయులకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: టీంమిండియా

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 12:30 PM

భారతీయులకి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: టీంమిండియా

భారత క్రికెట్ జట్టు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంభందించిన ఓ వీడియో బీసీసీఐ రిలీజ్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, టీమ్ హెడ్‌ కోచ్ రవిశాస్త్రి తదితరులు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.కరీబియన్ టూర్‌లో ఇప్పటికే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ ముగియగా.. టీ20 సిరీస్‌ని 3-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు.. వన్డే సిరీస్‌‌ని 2-0తో కైవసం చేసుకుంది. ఇక రెండు టెస్టుల సిరీస్‌ ఈనెల 22 నుంచి ప్రారంభంకానుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ శతకాలతో సత్తాచాటగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఐదో స్థానంలో ఆడిన శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20, వన్డే సిరీస్‌లో కనీసం ఒక్క అర్ధశతకం కూడా సాధించలేకపోయాడు. దీంతో.. అతని కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోగా.. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. బుధవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో గోల్డెన్ డక్‌గా ఔటై మళ్లీ తన సామర్థ్యంపై అనుమానాలు రెకెత్తించాడు. సైన్యంతో కలిసి పనిచేసేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈ విండీస్‌ టూర్‌కి దూరమైన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements