అమెరికాలో ఇండియన్ విద్యార్థికి జైలు శిక్ష

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 01:16 PM

అమెరికాలో ఇండియన్ విద్యార్థికి జైలు శిక్ష

న్యూయార్క్: అమెరికాలో ఇండియన్ విద్యార్థికి అక్కడి కోర్టు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. అతను కంప్యూటర్లను షార్ట్ సర్క్యూట్ తో ధ్వంసం చేసినందుకు గాని ఈ శిక్ష విధించింది. విశ్వనాథ్ అకుతోటా అనే విద్యార్థి అల్బానీలో సెయింట్ రోస్ కాలేజీలో ఎంఎస్ చేస్తున్నాడు. విశ్వనాథ్ యుఎస్బీతో కంప్యూటర్ కు ఛార్జింగ్ చేస్తున్నాడు. విరామం లేకుండా ఛార్జింగ్ పెడుతుండడంతో 66 కంప్యూటర్లలో ఉన్న (యుఎస్బీ కిల్లర్ ) యుఎస్బీ పోర్ట్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ధ్వంసమయ్యాయి. దీంతో కాలేజీ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నారు. స్థానిక కోర్టు ఆ విద్యార్థికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 58,471 డాలర్లు (41,56,118 రూపాయలు) జరిమానా విధించింది.





Untitled Document
Advertisements