రైల్వే ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 03:17 PM

రైల్వే ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

రైల్వే ప్రయాణికుల భద్రత కోసం కేంద్రం తాజాగా తొలి రైల్వే కమాండో యూనిట్ ‘కోరస్‌’ (కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ)ను ప్రారంభించింది. ఛత్తీస్‌గడ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కోరస్ కమాండో సేవలు తొలిగా అందుబాటులోకి వస్తామని ఆర్‌పీఎఫ్ డీజీ అరుణ్ కుమార్ బుధవారం తెలిపారు. హరియాణలోని జగధ్రిలో కోరస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు కానుంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కమాండోస్ ఫర్ Railways సేఫ్టీ (కోరస్) యూనిట్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ.. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కోరస్ కమాండోలకు శిక్షణ ఇవ్వాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఆదేశించామని Piyush Goyal పేర్కొన్నారు. ‘నక్సల్ ప్రభావమున్న ఛత్తీస్‌గడ్‌లో ఈ స్పెషల్ ఫోర్స్ సేవలు తొలిగా అందుబాటులోకి వస్తాయి. అలాగే రైల్వే‌కు సంబంధించిన పెద్ద ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లోనూ (ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్) వీరి సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం’ అని కుమార్ తెలిపారు. నష్టం వాటిల్లడం, డిస్ట్రబెన్స్, రైలు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటం, దాడి, హైజాక్, విపత్తు పరిస్థితులు వంటివి సంభవించినప్పుడు కోరస్ యూనిట్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. కోరస్‌లో ఆర్‌పీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్) చెందినవారు ఉంటారు. దీనికి ఆర్‌పీఎఫ్ డీజీ హెడ్‌గా వ్యవహరిస్తారు. వీరికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్‌తో కూడిన ప్రత్యేకమైన యూనిఫామ్ ఉంటుంది. హెల్మెట్లు, అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉంటారు. 14 బెటాలియన్ల ఆర్‌పీఎస్ఎఫ్ బలగాలు ఉన్నాయని, వీటిల్లో ఒక బెటాలియన్‌ను కోరస్‌గా మారుస్తామని కుమార్ తెలిపారు. కోరస్‌ టీమ్‌లోని వారికి ఎస్ఎస్‌జీ అకాడమీ, గ్రేహౌండ్స్‌‌తో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements