పెద్దోళ్ళు చెప్తరు...రెండు కాల్చుకోవాలే...రెండు దాచుకోవాలే

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 07:09 PM

పెద్దోళ్ళు చెప్తరు...రెండు కాల్చుకోవాలే...రెండు దాచుకోవాలే

మెగా హీరో వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకుడు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు ఇది రీమేక్. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వరుణ్ తేజ్ ఫస్ట్‌లుక్, ‘వాల్మీకి’ ప్రీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వరుణ్ లుక్‌ను, పాత్ర పోలికలను చూసి ఆయన అభిమానులు షాక్ అయ్యారు. కిల్లింగ్ లుక్‌లో వరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు తన పాత్రలోని మొరటితనాన్ని వరుణ్ చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘వాల్మీకి’ టీజర్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఈ టీజర్‌లో వరుణ్ లుక్, యాటిట్యూబ్ భయానకంగా ఉన్నాయి. ఆ పాత్రలో వరుణ్ నటన కిర్రాక్ అంతే. ‘‘అందుకే పెద్దోళ్లు చెప్పిరు.. నాలుగు బుల్లెట్లు సంపాయిత్తే రెండు కాల్చుకోవాలే, రెండు దాచుకోవాలే’’ అంటూ వరుణ్ చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలైట్. వ‌రుణ్ తేజ్ ఈ చిత్రంలో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నుంచి సినీ రచయితగా మారిన వ్యక్తి పాత్రలో న‌టిస్తుండ‌గా.. త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాళిని ర‌వి హీరోయిన్లు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.





Untitled Document
Advertisements