దేశం కోసం వాజ్ పేయి ఎనలేని సేవలు చేసారు

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:17 AM

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు పలువురు బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు వాజ్‌పేయి స్మృతి కేంద్రం సదవ్‌ అటల్‌ను సందర్శించి వాజ్ పేయికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. దేశం కోసం వాజ్ పేయి ఎనలేని సేవలు చేశారని ఆయన కొనియాడారు. వాజ్ పేయి ఆశయసాధనలో ముందుకు సాగి శాంతి స్థాపన, జాతి సమగ్రతకు పాటుపడాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా ఆయన దత్త పుత్రిక నమితా కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారిక తో పాటు ఆయన కుటుంబ సభ్యలు నివాళులు అర్పించారు.





Untitled Document
Advertisements