భారత జట్టు మాజీ క్రికెటర్ విబి చంద్రశేఖర్ (57) ఆత్మహత్య చేసుకున్నాడు. చైన్నైలోని తన ఇంటిలో ఉరేసుకొని చనిపోయాడు. 1988 నుంచి 1990 మధ్య ఇండియా తరఫున చంద్రశేఖర్ ఏడు వన్డేలు ఆడి 551 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 56 బంతుల్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. తమళనాడు జట్టుకు ఓపెనర్ గా సేవలందించాడు. 81 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన చంద్ర శేఖర్ 4999 పరుగులు చేశాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ లో డైరెక్టర్ గా పని చేశాడు. బిసిసిఐ బోర్డు చంద్రశేఖర్ మృతిపట్ల సంతాపం తెలిపింది. ఆయన మృతి వార్త వినగానే తాము షాక్ గురయ్యామని మాజీ ఆటగాళ్ల హర్భజన్ సింగ్, వివిఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, తదితరులు తన ట్విట్టర్ లో ట్వీట్ చేసి సంతాపం తెలిపారు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.