అభిమానులకు రిక్వెస్ట్

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:55 AM

అడివి శేషు తన అభిమానులకు ఒక రిక్వెస్ట్ ను సోషల్ మీడియా ద్వారా అందించారు. ఎవరు సినిమా లోని ముఖ్య సన్నివేశాలైన రెజినా కాసాండ్రా మరియు నవీన్ చంద్ర కి సంబందించిన పలు సన్నివేశాలను తన అభిమానులు మరియు స్పాయిలర్స్ అత్యుత్సహంతో మొబైల్ లో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారనిచేస్తున్నారని సమాచారం అందింది. ఏది ఏమైనా ఎవరు సినిమా ని ఇంత ఘన విజయం సాధించటం పట్ల ఎవరు టీం సంతోషం వ్యక్తం చేసారు. ఇంతటి సక్సెస్ ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలను తెలియ చేస్తూ ట్విట్టర్ లో తన సందేశాన్ని తెలియ చేసారు.

ఎవరు చిత్రం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15 న విడుదలైన సంగతి మనకు తెలిసినదే. ఈ చిత్రం లో అడివి శేషు, రెజినా కాసాండ్రా మరియు నవీన్ చంద్రలు కీలక పాత్రలుగా నటించారు. థ్రిల్లర్ సస్పెన్సు కి సంబందించిన మూవీ కావడం, ట్విస్ట్ లతో మూవీ ని రక్తి కట్టించడం లో డైరెక్టర్ సఫలం అయినట్లు తెలుస్తుంది. మున్ముందు ఇంకెంత విజయబాటలో ప్రయాణిస్తుందో వేచి చూడాలి.





Untitled Document
Advertisements