భార్య మీద కోపంతో ఐదుగురు పిల్లల హత్య

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 12:39 PM

భార్య మీద కోపంతో ఐదుగురు పిల్లల హత్య

అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచుకోవాల్సిన ఓ కసాయి తండ్రి వారిని అతి కిరాతకంగా చంపి ఆ శవాలతో ఊరంతా చక్కర్లు కొట్టాడు. చివరికి పోలీసులకు ‘డ్రంగ్ అండ్ డ్రైవ్’ టెస్టులో చిక్కాడు. అయితే, పేదరికం వల్లే అతడు ఈ హత్యలు చేశాడని అంతా భావించారు. కానీ, ఇటీవల కోర్టులో అతడు చెప్పిన షాకింగ్ నిజం విని అంతా నిర్ఘాంతపోయారు. అమెరికాలోని దక్షిణ కరోలినాలో చోటుచేసుకుంది. తిమోతీ జోన్స్ జూనియర్ (36) అనే వ్యక్తి తన పిల్లలు మీరా (8), ఎలియాస్ (7), నటాన్ (6), గ్యాబర్రియల్ (2), అబిగైల్ (1) దారుణంగా కొట్టి చంపేశాడు. అనంతరం వారి శవాలను చెత్త కవర్లలో పెట్టి తన ఎస్‌యూవీ కారులో పెట్టి సుమారు వారం రోజులు పాటు తిరిగాడు. చివరికి అలబామాలోని నిర్మానుష్య ప్రాంతంలో వాటిని పాతిపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత మిస్సిస్సిప్పి‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. అతడి వాసన పరిశీలించారు. అయితే, నోటి నుంచి కంటే.. కారు లోపల నుంచే ఎక్కువ దుర్వాసన రావడం గమనించారు. అనుమానంతో కారును తనిఖీ చేయగా వెనుక సీట్లలో రక్తపు మరకలు, రసాయనాలు కనిపించాయి. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను హత్య చేసిన తర్వాత వాటిని ఏం చేయాలో అర్థంకాక ఎస్‌యూవీలో వేసుకుని తిరిగినట్లు పోలీసులు తెలిపారు. జోన్స్‌ భార్య అతడిని వదిలేయడంతో పిల్లల పోషణ భారమైంది. దీంతో స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఆ పిల్లల బాగోగులు చూసుకునేవారు. పిల్లల హత్య కేసులో అరెస్టయిన తర్వాత జోన్స్ సరైన కారణం చెప్పలేదు. పిలల్లను పోషించలేక ఈ అరాచకానికి పాల్పడ్డాడని భావించారు. అయితే, ఇటీవల కోర్టు విచారణలో అసలు విషయాన్ని వెల్లడించాడు. తన భార్య బొమ్మల షాపులోని ఓ యువకుడి అక్రమ సంబంధం పెట్టుకుందని, ఆమెపై ప్రతీకారం తీర్చుకోడానికే పిల్లలను చంపేశాడని తెలిపాడు.





Untitled Document
Advertisements