అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమం

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 01:29 PM

ఢిల్లీ : మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. శ్వాస తీసుకోవడంలో జైట్లీ ఇబ్బంది పడుతున్నారు. గత 9వ తేదీ నుంచి ఆయనకు ఐసియులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎయిమ్స్ కు బయల్దేరారు. గత ఎన్ డిఎ ప్రభుత్వంలో జైట్లీ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అరుణ్ జైట్లీ కోలుకోవాలని బిజెపి శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి పై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య తదితర ప్రముఖులు ఆరా తీశారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.





Untitled Document
Advertisements