కోల్ కతా: ర్యాష్ డ్రైవింగ్తో పాటు ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో బిజెపి ఎంపి రూపా గంగూలీ కొడుకు ఆకాశ్ ముఖర్జీని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగంగా కారు నడిపిన ఆకాశ్ కోల్కతాలోని ఓ గోడను ఢీకొట్టాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రూపా కుమారుడు ముఖర్జీని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా, ఆకాశ్ తాగి డ్రైవ్ చేస్తున్నాడా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టామని ఉన్నతాధికారులు తెలిపారు. కోల్కతాలోని అలిపోర్ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టనున్నారు. చట్టం దృష్టిలో అందరు సమానమేనన్న ఎంపి చట్ట ప్రకారమే తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.