అణుబాంబు వేసేందుకు వెనుకాడం!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 04:23 PM

అణుబాంబు వేసేందుకు వెనుకాడం!

పాకిస్థాన్ కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా ప్రోఖ్రాన్ లో ఆయనకు నివాళులర్పించారు. జమ్మూకాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ భారత్ పై జీహద్ ప్రకటించింది. దీంతో భారత్, పాక్ ల మధ్య యుద్ధం వస్తే, భారత్ ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అన్నారు. అయితే ఇప్పటివరకూ ఆ విధానానికి తాము కట్టుబడి ఉన్నామని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని, బాధ్యతాయుత అణ్వాయుధ దేశంగా భారత్ ఉందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements