రాజేంద్రప్రసాద్ పై విరుచుకుపడ్డ పృథ్వి

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 05:19 PM

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ నేత పృథ్వి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టాలీవుడ్ పెద్దలు జగన్ ను కలిసి శుభాకాంక్షలు చెప్తే బాగుండేదని మాత్రమే తాను అన్నానని, ఎవరి గురించీ తాను తప్పుగా మాట్లాడలేదని పృథ్వి అన్నారు. ముఖ్యమంత్రిని వెంటనే కలవడానికి తాము వ్యాపారస్తులం కాదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే సినీ పెద్దలు ఆయన్నెలా కలిశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల నేత అని, ఆయన్ను ఎవరేమన్నా అంటే తాట తీస్తానని పృథ్వి హెచ్చరించారు.





Untitled Document
Advertisements