పసిడి గెలవాలనే తపన!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 06:01 PM

పసిడి గెలవాలనే తపన!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గడిచిన 8 నెలల్లో కనీసం ఒక్క టైటిల్‌ని కూడా గెలవలేకపోయింది. ఇటీవల ముగిసిన ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్‌లో యమగూచి చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన పీవీ సింధు.. ఛాంపియన్‌షిప్‌ కోసం గత కొద్దిరోజులుగా తీవ్రంగా శ్రమిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా ఈనెల 19 నుంచి 25 వరకూ ప్రపంచ ఛాంపియన్‌‌షిప్ టోర్నీ జరగనుంది. ఈ మెగా టోర్నీలో పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ టైటిల్ రేసులో ముందున్నారు. అయితే.. సైనా నెహ్వాల్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు నెలకొనగా.. ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే రెండు రజతాలు, రెండు కాస్యాలు సాధించిన పీవీ సింధుపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 2013 నుంచి పీవీ సింధు గట్టి పోటీదారుగా కనిపిస్తోంది. 2013, 2014లో కాంస్య పతకాలు గెలుపొందిన సింధు.. ఆ తర్వాత 2017, 2018లో రజతాలు గెలిచింది. కానీ.. బంగారు పతకం మాత్రం ఈ యువ షట్లర్‌కి కలగానే మిగిలింది. దీంతో.. కనీసం ఈ ఏడాదైనా.. పసిడి గెలవాలని సింధు ఆశిస్తోంది.





Untitled Document
Advertisements