రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి పాకిస్తాన్లోని కరాచీ వరకు నడిచే థార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును భారత్ రద్దు చేసింది. ప్రతీ శుక్రవారం ప్రయాణం కొనసాగించాల్సిన ఈ రైలు ఇకపై నడవదని వాయువ్య రైల్వే సీపీఆర్వో అభయ్ శర్మ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రైలు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.