అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా పివిపి సినిమా బ్యానర్పై రూపొందిన థ్రిల్లర్ ‘ఎవరు’. వెంకట్ రామ్జీ దర్శకత్వంలో పెర్ల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్రాజు మాట్లాడుతూ “క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించి ‘క్షణం’ సినిమాతో పెద్ద హిట్ కొట్టి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఆ తర్వాత ‘గూఢచారి’తో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ‘ఎవరు’తో హిట్ను అందుకున్నాడు. ఈ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్ లేకుండా దర్శకుడు వెంకట్ రామ్జీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇన్ని ట్విస్టులతో ప్రేక్షకుడిని థ్రిల్ చేయడమనేది ఈ మధ్య జరుగలేదు.
నా మిత్రుడు పివిపి బ్యానర్లో మరో మంచి సినిమా వచ్చింది”అని అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ “డైరెక్టర్ వెంకట్ రామ్జీకి అభినందనలు. నవీన్ చంద్ర హీరోగానే కాదు నటుడిగా కూడా రాణిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయినందుకు హ్యాపీగా ఉంది”అని తెలిపారు. డైరెక్టర్ వెంకట్ రామ్జీ మాట్లాడుతూ “ఇది నా ఒక్కడి విజయం కాదు.. ఎంటైర్ టీమ్ది. నా నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ వాళ్ల బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. అడివిశేష్ మాట్లాడుతూ “ఎవరు సినిమాకు ‘గూఢచారి’ కంటే మూడు రెట్లు ఓపెనింగ్స్ వచ్చాయని అందరూ అంటున్నారు. నా కెరీర్లో ఈ సినిమా ఓ స్పెషల్ మూవీగా నిలిచింది. సినిమాలో రెజీనా అద్భుతంగా నటించింది”అని అన్నారు. ఈ సమావేశంలో నవీన్ చంద్ర, రెజీనా కసండ్ర, మురళీ శర్మ పాల్గొన్నారు.