సూపర్ స్టార్ రికార్డును బద్దలు కొట్టిన ప్రభాస్

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 04:56 PM

బాహుబలి'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రిలీజ్ కావడానికి ముందే ఈ సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, అంచనాలను మరింత పెంచేసింది.

మరోవైపు పారిస్ లోని ప్రతిష్ఠాత్మక థియేటర్ 'లి గ్రాండ్ రెక్స్'లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ థియేటర్ యూరప్ లోనే అతి పెద్దది. ఈ థియేటర్ లో ఒకేసారి 2800 మంది సినిమాను వీక్షించవచ్చు. ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన 'కబాలి', విజయ్ నటించిన 'మెర్సెల్', ప్రభాస్ నటించిన 'బాహుబలి' దక్షిణాది చిత్రాలు మాత్రమే ఈ థియేటర్ లో ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు 'సాహో'ను కూడా ఆ థియేటర్ లో ప్రదర్శించనుండటంతో... ఆ థియేటర్ లో రెండు సినిమాలను విడుదల చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్టు పుటల్లోకి ఎక్కబోతున్నాడు.





Untitled Document
Advertisements