శేఖర్ కమ్ముల కోసం ఆ కొత్త ప్రయత్నం

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 07:46 PM

మజిలీ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం వెంకీమామ సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ముల డైరక్షన్ లో మూవీ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా వస్తుందట. ఈ మూవీలో నాగ చైతన్య కూడా తెలంగాణా యాసలో మాట్లాడుతాడని తెలుస్తుంది. దానికి కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నారట. ఆల్రెడీ శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా లో సాయి పల్లవి చేత తెలంగాణ భాషను మాట్లాడింది సూపర్ హిట్ కొట్టాడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు హీరో చైతు చేత కూడా ఆ భాష మీద పట్టు వచ్చేలా చేస్తున్నాడట. మరి ఇప్పటివరకు వాయిస్ మాడ్యులేషన్ చేయని చైతన్య శేఖర్ కమ్ముల కోసం ఆ కొత్త ప్రయత్నం చేస్తున్నాడు.





Untitled Document
Advertisements