అర్జున్ జైట్లీ ఆరోగ్యం విషమం .. పలువురు పరామర్శ

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 10:08 AM

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగానే మారింది. పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లి జైట్లీని పరామర్శిస్తున్నారు. పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. శ్వాస సంబంధ సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్‌లో జైట్లీ చేరారు. గుండె సంబంధిత విభాగంలో నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నారు. గత కొన్నాళ్లుగా అరుణ్ జైట్లీ మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఇటీవల అమెరికా వెళ్లి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నారు. తిరిగి భారత్‌కు వచ్చిన తర్వాత చికిత్సను కొనసాగిస్తున్నారు జైట్లీ. కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు.





Untitled Document
Advertisements