కర్నూల్ జిల్లా దిన్నెదేవరపాడులో దారిదోపిడీ జరిగింది. బైక్ పై వెళ్తున్న తండ్రీ కూతుళ్లను అటకాయించి దొంగలు దోచుకున్నారు. గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి తన కూతురుని బైక్ పై ఎక్కించుకుని తీసుకువెళ్తుండగా తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో దొంగలు దాడిచేశారు. రెండున్నర తులాల గోల్డ్ చైన్, మూడు వేల రూపాయలు డబ్బు, సెల్ ఫోన్ దోచుకున్నారు. దొంగల దాడిలో మహేశ్వర్ రెడ్డికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.