మూడు జోనల్ కార్యాలయాల సమీక్షా

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 11:46 AM

మూడు జోనల్ కార్యాలయాల సమీక్షా

ప్రభుత్వ అనుసంధాన ఆంధ్రాబ్యాంకు బ్యాంకింగ్ సంస్కరణలో భాగంగా శనివారం మూడు జోనల్ కార్యాలయాల సమీక్షా సమావేశాలను ప్రారంభించారు. తొలి రోజు హైదరాబాద్ 1,2లతో పాటు సికింద్రాబాద్ జోనల్ సమావేశాలను జరిగాయి. ఈ మూడు జోనల్ పరిధిలోని సమీక్షా సమావేశాల్లో జోన్‌ల పరిధిలోని తమ బ్యాంకు శాఖల పనితీరును సమీక్షించారు. తొలి సారి ఆంధ్రాబ్యాంకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా బ్యాంకు శాఖల పరిధిలోని ఆర్థిక ప్రగతికి సరికొత్త ఆలోచనలు, స్వీకరణలు, జాతీయ ప్రాధాన్యత అంశాలు, బ్యాంకు శాఖల పరిపుష్టికి చర్యలను సమీక్షించారు.ఈ సమావేశాలు ఆదివారం కూడా నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఆదర్శవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు అనువైన సంప్రదింపులు జరిపారు. ప్రజల అవసరాల మేరకు వయోవృద్ధులు, రైతులు, చిన్న పరిశ్రమలు, యవ పారిశ్రామిక వేత్తల, విద్యార్థుల స్త్రీల ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా ఈ సమావేశాల్లో పరిశీలించారు. శనివారం జోనల్ సమావేశాలను ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పకిరి సామి, హైదరాబాద్ జోన్-1 జోనల్ మేనేజర్ రాజేంద్ర కుమార్, జిఎం.వేణుమాధవ్, హైదరాబాద్-2 జోనల్ మేనేజర్ మల్లవధనులు,జిఎం. ధనుంజయ రావు తదితరులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements