తెలంగాణ ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మూడురోజుల నుంచి ఆరోగ్యశ్రీ ఆగిపోవడంతో రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో నిమ్మ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులు రోగులుతో కిటకిటలాడుతున్నాయి.