భారతజట్టు ప్రధాన కోచ్ గా మళ్ళీ రవిశాస్త్రీనే రీఅపాయింట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రవిశాస్త్రిని నాలుగోసారి ఎంపిక చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. కపిల్దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతరంగస్వామి కమిటీ ఏకగ్రీవ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఇంత హైరానా ఎందుకు. అతన్నే ఎంపిక చేయాలనుకున్నప్పుడు మిగిలిన వారికి ఇంటర్వ్యూలు చేయడం ఎందుకు?. ముందే ప్రకటించేస్తే సరిపోయేది కదాగ అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.కాగా ఈ నిర్ణయాన్నిజీర్ణించుకోలేకపోతున్న అభిమానులు ఘాటైన విమర్శలు చెస్తున్నారు. ఖటీమ్ ఇండియా 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2019 వన్డే ప్రపంచకప్ కోల్పోయింది. ఇకపై 2020, 2021లలో జరిగే టీ20 ప్రపంచకప్లూ హుష్ కాకి అన్నమాట’ అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.