వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ ప్రభుత్వానికే నమ్మకంలేకుండాపోతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రతిదీ కేంద్రం మీద నెట్టాలనే వైసీపీ ప్రభుత్వతీరు సరికాదన్న కన్నా... పీపీఏల సమీక్ష వద్దని కేంద్రం వద్దంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వినలేదని ప్రశ్నించారు. రివర్స్ టెండర్లు మంచిది కాదని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ రాస్తే పట్టించుకోని ప్రభుత్వం... అన్నీ కేంద్రానికి చెప్పి చేస్తున్నామని అనడం కరెక్ట్ కాదన్నారు.