పారా మిలిటరీలోని 106టీఏ బెటాలియన్తో కలిసి విధులు నిర్వహించిన భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్ళీ వార్తల్లో నిలిచాడు. అందుకు కారణం ధోనీ రాజకీయ నాయకుడి దుస్తుల్లో ఉన్న ఫొటోలు సోషల్మీడియాలో ప్రత్యక్షం కావడమే. ధోనీ మిత్రుడు మిహిర్ దివాకర్ ధోనీ రాజకీయ నేతగా ఉన్న ఫొటోలు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు నిజంగానే ధోనీ రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అని అనుకున్నారు. నిజానికి ధోనీ రాజకీయాల్లోకి రావడం లేదు. ఓ యాడ్ సంబంధించి.. ధోనీ ఈ అవతారం ఎత్తాడు. ఈ విషయం తెలిసి.. ధోనీ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా కూల్గా ఉండే ధోనీ రాజకీయాలకు సరిపోడు అని కొందరు అంటుంటే.. రాజకీయాల్లోకి వస్తే వాళ్లు ధోనీని చెడగొడతారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.