చంద్రబాబుకు ఇంకా బుద్ధి రావడం లేదు

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 07:58 PM

ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే జగన్ అధికారాన్ని చేపట్టి 100 రోజులు కూడా గడవలేదు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అప్పుడే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.

అయితే టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై స్పందించిన ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసారు. ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైనా, పార్టీలోని నాయకులు వలసలు వెలుతున్నా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రావడం లేదని అన్నారు. పోలవరం రీ టెండరింగ్ విషయంలో హైకోర్ట్ ఇచ్చిన స్టేని చూసి మాజీ మంత్రి దేవినేని సంబరాలు చేసుకుంటున్నారని, హైకోర్ట్ తాత్కాలికంగా రివర్స్ టెండరింగ్ ఆపమని చెప్పిందే కానీ చంద్రబాబు చెప్పిన వ్యక్తులకు ఇవ్వమని కాదని, పోలవరం కాంట్రాక్ట్‌లలో జరిగిన అవినీతిని ఖచ్చితంగా వెలికి తీస్తామని అన్నారు. అంతేకాదు ఏపీ రాజధాని అమరావతి మార్పు ఉండబోదని, మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు గురుంచి మాట్లాడడంలేదని కావాలనే చంద్రబాబు అండ్ టీం ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్దారు.





Untitled Document
Advertisements