లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఖేరీ జిల్లా లఖ్మిపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఆరు సంవత్సరాల బాలికపై వరసకు సోదరులయ్యే ఇద్దరు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15, 12 ఏళ్లు గల ఇద్దరు దళిత పిల్లలు అమ్మాయికి (6) చాక్లెట్ కోనిస్తానని గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం హత్య చేశారు. భయంతో హత్య వివరాలను తనలి తల్లికి చెప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఒక రోజు మొత్తం వెతికినప్పటికి కనిపించలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక మృతదేహం గ్రామ శివారులో లభించడంతో శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టమ్లో తేలింది. చివరగా ఇద్దరు మైనర్లతో బాలిక కనిపించిందని గ్రామస్థులు తెలపడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. మృతదేహాన్ని దాచి పెట్టినందుకు నిందితుల తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మైనర్లను పోలీసులు జువైనల్ హోమ్కు తరలించారు.