ఇండియాపై విరుచుకుపడ్డ పాక్ మంత్రి...పిడిగుద్దులు గుద్దిన పాకీలు

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 08:52 PM

ఇండియాపై విరుచుకుపడ్డ పాక్ మంత్రి...పిడిగుద్దులు గుద్దిన పాకీలు

కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న అనంతరం ఇండియాపై పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు అతనిపై కొందరు గుడ్లతో దాడి చేసి, పిడిగుద్దులు కురిపించారు. లండన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇటీవల చర్చనీయమైంది. అయితే, అతడిపై దాడి చేసిన వ్యక్తులు భారతీయులు కాదు. పాకిస్థాన్‌ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తలు. ఇటీవల ఇండియాపై ఆరోపణలు చేస్తూ వార్తల్లోకెక్కిన రషీద్ అహ్మద్‌పై భారత నెటిజనులు గుర్రుగా ఉన్నారు. తాను భారత ముస్లిం సొదరుల గోడు వెల్లడించే గొంతుకనంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన కొద్ది రోజులు మీడియాలో వైరల్ అయ్యాడు. అవామీ ముస్లిం లీగ్ (ఏఎంఎల్)‌కు అధ్యక్షుడి హోదాలో రషీద్ ఇటీవల లండన్ వెళ్లాడు. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత హోటల్ నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగాడు. అతడి కోసం కాపు కాసిన పీపీపీ కార్యకర్తలు వెంటనే గుడ్లతో కొట్టి, ముఖంపై గుద్ది పారిపోయారు. రషీద్ అంగీకరిస్తే దాడిచేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏఎంఎల్ లండన్ అధ్యక్షుడు తెలిపాడు. ఈ విషయం తెలియగానే సోషల్ మీడియాలో భారతీయులు కామెంట్ల దాడి చేస్తున్నారు. ‘‘భారత ముస్లింల గురించి కాకుండా.. ముందు నీ దేశంలోని ప్రజల గురించి ఆలోచించు’’ అంటూ పంచులు విసురుతున్నారు. తమ నాయకుడిపై విమర్శలు చేస్తున్నందుకే రషీద్‌ను గుడ్లతో కొట్టామని, ఇంకేదీ చేయకుండా వదిలేసినందుకు అతడు సంతోషించాలని పీపీపీకి చెందిన ఓ ప్రతినిధి వెల్లడించాడు.





Untitled Document
Advertisements