ప్రస్తుతం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని టిడిపి నేతలు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు తరలిస్తున్నారు. ఆయన భౌతికకాయం వెంట టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వెళ్లనునట్లు తెలుస్తోంది. ఏపీలోని టిడిపి నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని మంగళగిరి టిడిపి కార్యాలయంలో ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు కోడెల స్వస్థలం నరసారావుపేటకు తరలించి రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయఘటనలు జరుగకుండా నరసారావుపేట నియోజకవర్గంలో భారీగా పోలీసులను మోహరించారు. ఆ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో సెక్షన్ 144 విధించి కర్ఫ్యూ అమలుచేస్తున్నారు.