ప్రకాశం జిల్లాలో దారుణం ... ఇద్దరితో అక్రమ సంబంధం...ఒకరి చేతిలో హతం

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 03:29 PM

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. వివాహితను ఆమె ప్రియుడు చంపి మృతదేహాన్ని కొండల మధ్య పెట్రోల్ పోసి తగులబెట్టాడు. తమ కూతురు కనిపించడం లేదని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహిళను హతమార్చిన ఆ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్లవారిపల్లికి చెందిన రజియా బేగం కి రసూల్ భాషా అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో రజియా భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. రజియా బేగంకు ఓ కుమారుడు ఉన్నాడు. కనిగిరిలో ఐకెపిలో యానిమేటర్‌గా పని చేస్తోంది. తనకు వచ్చే జీతంతో కొడుకుతో పాటూ తల్లిదండ్రులను పోషిస్తోంది. రోజూ కంచర్లవారిపల్లి నుంచి కనిగిరి వచ్చే రజియాకి స్కూల్ బస్సు డ్రైవర్ గా పని చేసే ఖాదర్ బాషాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రజియా ఖాదర్ బాషాల ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఐదేళ్ల పాటూ సజావుగానే సాగింది. వివాహితుడైన ఖాదర్ భాషా తన భార్యపిల్లలను కూడా వదిలి రజియా బేగంతోనే సహజీవనం చేశాడు. అయితే కొన్నాళ్లపాటు రజియా బేగంతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఖాదర్ భాషాకి ఆమెపై అనుమానం మొదలైంది. రజియా వేరే వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని వేధించడం ప్రారంభించాడు. ఖాదర్ భాషా వేధింపులు తట్టుకోలేక రజియా కనిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో ఖాదర్ భాషా వేధింపులు తగ్గాయి. ఖాదర్ భాషా రజియా బేగంను వదిలిపెట్టినా ఆమెపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా రజియా బేగంను అంతమొందించాలని ఖాదర్ భాషా భావించాడు. రజియాపై మనస్సులో పగ పెంచుకున్న ఖాదర్ భాషా ఆమెను హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. ఈనెల 7వ తేదీ మాట్లాడటానికి రమ్మంటూ రజియాని కనిగిరి శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మర్రిపూడి మండలం కూచిపూడి శివారు ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ నిర్జన ప్రదేశంలో రజియా బేగంతో ఘర్షణ పడ్డాడు. ముందు అనుకున్న ప్రకారం రజియా బేగంను గొంతు నులిమాడు. అక్కడే ఉన్న కొండ రాళ్లకు రజియా బేగం తలను కొట్టి చంపాడు. రజియా బేగం చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత ఖాదర్ భాషా అక్కడి నుండి కనిగిరి వచ్చాడు. తన బావ జిలానీతో విషయం చెప్పాడు. రజియా బేగంని చంపిన ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. రజియా కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖాదర్ భాషా పై అనుమానంతో విచారించిన పోలీసులు విషయం బయటకిలాగారు. రజియాను అతి కిరాతకంగా హతమార్చిన ఖాదర్ భాషాను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.





Untitled Document
Advertisements